హరికృష్ణ శుభారంభం

12 Sep, 2015 02:39 IST|Sakshi

 బాకు (అజర్‌బైజాన్) : ప్రపంచ కప్ చెస్ టోర్నీలో తెలుగు గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ శుభారంభం చేశాడు. మ్యాక్స్ ఇల్లింగ్‌వర్త్ (ఆస్ట్రేలియా)తో జరుగుతున్న తొలి రౌండ్ మొదటి గేమ్‌లో హరికృష్ణ విజయం సాధించాడు. 59 ఎత్తులో హరి గేమ్ ముగించాడు. మరో వైపు లలిత్‌బాబు, వోటాసెక్ (పోలండ్) మధ్య జరిగిన గేమ్ 39 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. ఇతర భారత ఆటగాళ్లలో సేతురామన్ విజయం సాధించగా, గంగూలీ ఓడిపోయాడు. విదిత్ గుజరాతీ, ఆదిబన్ కూడా తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు.

మరిన్ని వార్తలు