హారిక, పద్మిని గేమ్‌లు ‘డ్రా’

18 Feb, 2017 00:16 IST|Sakshi

టెహరాన్‌ (ఇరాన్‌): ప్రపంచ మహిళల చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణులు ద్రోణవల్లి హారిక, పద్మిని రౌత్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ తొలి గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. సొపికో గురామిష్‌విలి (జార్జియా)తో జరిగిన గేమ్‌లో నల్లపావులతో ఆడిన హారిక 49 ఎత్తుల్లో... తాన్‌ జోంగి (చైనా)తో జరిగిన గేమ్‌లో నల్లపావులతో ఆడిన పద్మిని 60 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. శనివారం జరిగే రెండో రౌండ్‌లో గెలిచిన వారు క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. 

మరిన్ని వార్తలు