హరినాథ్‌ దత్తాకు స్వర్ణం

25 Mar, 2018 10:46 IST|Sakshi

ఇంటర్‌ స్కూల్‌ తైక్వాండో చాంపియన్‌షిప్‌

హైదరాబాద్‌: రాష్ట్ర స్థాయి ఇంటర్‌ స్కూల్‌ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన ఎన్‌. హరినాథ్‌ దత్తా ఆకట్టుకున్నాడు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

శనివారం జరిగిన సబ్‌జూనియర్‌ బాలుర ఫైనల్లో 9 ఏళ్ల హరినాథ్‌ దత్తా 2–2, 3–2, 3–2తో దుర్గా ప్రేమ్‌ (వికారాబాద్‌)పై విజయం సాధించాడు. 

మరిన్ని వార్తలు