ఇండియా టూర్‌ స్క్వాష్‌ టోర్నీ విజేత హరీందర్‌

22 Dec, 2019 13:54 IST|Sakshi

ముంబై: సొంతగడ్డపై భారత స్క్వాష్‌ రాకెట్స్‌ సమాఖ్య (ఎస్‌ఆర్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో జరిగిన ఇండియా టూర్‌ టోర్నమెంట్‌లో భారత ప్లేయర్‌ హరీందర్‌ పాల్‌ సంధూ విజేతగా అవతరించాడు.

ముంబైలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో నాలుగో సీడ్‌ హరీందర్‌ 11–5, 11–6, 11–7తో ఏడో సీడ్‌ టొమోటకా ఎండో (జపాన్‌)పై విజయం సాధించాడు. ఇదే టోర్నీ మహిళల సింగిల్స్‌ విభాగం ఫైనల్లో హనా రమదాన్‌ (ఈజిప్ట్‌) 11–8, 6–11, 11–4, 11–3తో లూసీ టర్మెల్‌ (ఇంగ్లండ్‌)ను ఓడించి టైటిల్‌ దక్కించుకుంది.  


 

మరిన్ని వార్తలు