సిడ్నీ థండర్‌తోనే హర్మన్‌ప్రీత్‌

25 Nov, 2017 00:58 IST|Sakshi

భారత స్టార్‌ మహిళా క్రికెటర్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ బిగ్‌బాష్‌ లీగ్‌లో సిడ్నీ థండర్‌ జట్టుతోనే కొనసాగనుంది. మరో రెండు సీజన్ల పాటు హర్మన్‌ తమ జట్టుకు ఆడే విధంగా శుక్రవారం థండర్‌ కొత్తగా ఒప్పందం పునరుద్ధరించుకుంది. విదేశీ లీగ్‌లో ఆడిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న హర్మన్‌...లీగ్‌లో సిడ్నీ జట్టు తరఫున ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీగా కూడా ఎంపికైంది. కొన్నాళ్ల క్రితం వన్డే వరల్డ్‌కప్‌ సెమీస్‌ మ్యాచ్‌లో ఆసీస్‌పై కౌర్‌ 171 పరుగులతో చెలరేగింది.   

మరిన్ని వార్తలు