హర్మన్‌కు గాయం... హర్లీన్‌కు స్థానం

21 Feb, 2019 01:48 IST|Sakshi

ముంబై: ఇంగ్లండ్‌ మహిళల జట్టుతో జరిగే మూడు వన్డేల సిరీస్‌ నుంచి చీలమండ గాయం కారణంగా వైస్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ వైదొలిగింది. హర్మన్‌ ప్రీత్‌ స్థానంలో హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన హర్లీన్‌ డియోల్‌ను తొలిసారి జట్టులోకి ఎంపిక చేశారు. పంజాబ్‌లో జన్మించిన 20 ఏళ్ల హర్లీన్‌ దేశవాళీ క్రికెట్‌లో హిమాచల్‌ ప్రదేశ్‌ జట్టు తరఫున ఆడుతుంది. ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఈనెల 22, 25, 28వ తేదీల్లో భారత్‌ మూడు వన్డేలు ఆడుతుంది. 

మరిన్ని వార్తలు