మా మ్యాచ్‌లు ఇవ్వండి!

18 Oct, 2017 00:35 IST|Sakshi

బీసీసీఐకి హెచ్‌సీఏ విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: వర్షాల కారణంగా హైదరాబాద్‌ జట్టు ఆడాల్సిన రెండు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు కూడా పూర్తిగా రద్దయ్యాయని, వీటిని మరోసారి నిర్వహించేలా చూడాలని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లతో హైదరాబాద్‌ ఆడాల్సిన ఈ మ్యాచ్‌లలో ఎనిమిది రోజుల పాటు ఒక్క బంతి కూడా పడలేదు. ‘మా గ్రూప్‌లో అందుబాటులో ఉన్న ఆరు మ్యాచ్‌లలో రెండు పూర్తిగా రద్దు కావడం దురదృష్టకరం. ఇది మా నాకౌట్‌ అవకాశాలను దెబ్బ తీస్తుంది.

కాబట్టి దేశంలో ఎక్కడైనా, ఎప్పుడైనా ఈ రెండు మ్యాచ్‌లను మళ్లీ నిర్వహించాలని మేం బీసీసీఐకి లేఖ రాశాము.  దీనిపై బోర్డు కార్యదర్శి అమితాబ్‌ చౌదరి స్పందించారు. హెచ్‌సీఏ అభ్యర్థనను పరిశీలిస్తామని...బోర్డు టోర్నమెంట్‌ అండ్‌ ఫిక్చర్స్‌ కమిటీ ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన మాకు ప్రత్యుత్తరం ఇచ్చారు’ అని హెచ్‌సీఏ కార్యదర్శి శేష్‌ నారాయణ్‌ వెల్లడించారు.  

మరిన్ని వార్తలు