న్యూఢిల్లీ: ఐపీఎల్లో మే 3న ఢిల్లీ, రాజస్తాన్ల మధ్య జరగబోయే మ్యాచ్ లీగ్ చరిత్రలో 500వ మ్యాచ్. ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ)లో జరిగే ఈ మ్యాచ్ కోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తామని లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా సారథ్యంలో కౌన్సిల్ సోమవారం సమావేశమైంది.
దీనికి రవిశాస్త్రి, గంగూలీ కూడా హాజరయ్యారు. ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ను బీసీసీఐ అవినీతి నిరోధక విభాగానికి చీఫ్గా నియమించారు. ఏడాది పాటు ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. అలాగే ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్లు పుణే, ముంబైలలో జరుగుతాయి. ఫైనల్ కోల్కతాలోనే నిర్వహిస్తారు. అండర్-23 క్రికెటర్లు రంజీ, టెస్టు క్రికెట్ను సీరియస్గా తీసుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో గంగూలీ సూచించాడు.