న్యూఢిల్లీ: గతేడాది టెస్టు హోదా పొందిన అఫ్ఘానిస్తాన్ జట్టు టెస్టు అరంగేట్రం వేదిక, తేదీలు ఖరారయ్యాయి. భారత్తో ఈ ఏడాది జూన్ 14 నుంచి 18 వరకు బెంగళూరు వేదికగా ఈ ఏకైక టెస్టు జరగనుందని బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి ప్రకటించారు. భారత్లో జూన్ మాసంలో జరగనున్న తొలి టెస్టు ఇదే కానుండటం గమనార్హం. గతంలో పాకిస్తాన్, జింబాబ్వే, బంగ్లాదేశ్ జట్లు కూడా తమ తొలి టెస్టులు భారత్తోనే ఆడాయి. భారత్ డే నైట్ టెస్టు మ్యాచ్ ఆడే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అమితాబ్ తెలిపారు. ఇప్పటివరకు 8 జట్లు డే నైట్ టెస్టు మ్యాచ్లు ఆడాయి.