ఉమెన్స్ ఆసియా గోల్డ్ మెడల్ విజేత రజని
సాక్షి, తిరుమల: తిరుమలేశుని ఆశీస్సులు, సహచర క్రీడాకారుల ప్రతిభతో ఆసియా హాకీ కప్ గెలిచామని భారత జట్టు గోల్కీపర్ ఇతిమరపు రజని ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ప్రపంచ స్థాయి హాకీ టోర్నీల్లో మరింత క్రీడాస్ఫూర్తితో రాణించి, మరిన్ని విజయాలు అందిస్తామన్నారు. ఆమెకు టీటీడీ జేఈఓ కేఎస్ శ్రీనివాసరాజు ప్రత్యేక దర్శనం కల్పించారు.