దబంగ్‌ ముంబై చేతిలో పంజాబ్‌ వారియర్స్‌ ఓటమి

12 Feb, 2017 00:38 IST|Sakshi

ఛండీగఢ్‌: హాకీ ఇండియా లీగ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ పంజాబ్‌ వారియర్స్‌కు దబంగ్‌ ముంబై జట్టు షాక్‌ ఇచ్చింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు 2–1తో గెలుపొందింది. ఓటమి తప్పదనుకున్న తరుణంలో 60వ నిమిషంలో రాబర్ట్‌ కెంపర్‌మన్‌ అద్భుతమైన ఫీల్డ్‌ గోల్‌ (రెండు గోల్స్‌తో సమానం)తో ముంబైని గెలిపించాడు.

పంజాబ్‌ జట్టు తరఫున మింక్‌ వాన్‌డెర్‌ వీర్డెన్‌ 37వ ని.లో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌తో కళింగ లాన్సర్స్‌ తలపడుతుంది.

మరిన్ని వార్తలు