నేటి నుంచి హెచ్‌ఐఎల్

25 Jan, 2014 01:02 IST|Sakshi

మొహాలీ: ఐపీఎల్ తరహాలో ప్రారంభమైన హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) తొలి సీజన్ విజయవంతం కావడంతో ఇప్పుడు అదే ఉత్సాహంతో రెండో సీజన్‌కు సిద్ధమవుతోంది. నేటి (శనివారం) నుంచి ఈ లీగ్ ప్రారంభం కానుంది.
 
 ఈ లీగ్ విజేతకు రూ.2.5 కోట్ల భారీ ప్రైజ్‌మనీని నిర్వాహకులు ప్రకటించిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో పంజాబ్ వారియర్స్, ఢిల్లీ వేవ్‌రైడర్స్ తలపడనున్నాయి. రాంచీ రైనోస్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ముంబై మెజీషియన్స్, ఉత్తరప్రదేశ్ విజార్డ్స్, కళింగ లాన్సర్ మిగతా జట్లు.
 

>
మరిన్ని వార్తలు