హాకీ సిరీస్ భారత్ కైవశం

9 Nov, 2014 18:48 IST|Sakshi

పెర్త్: హాకీ ఇండియా పురుషుల జట్టు ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించి సిరీస్ ను కైవశం చేసుకుంది. ఆదివారం జరిగిన నాల్గో మ్యాచ్ లో భారత హాకీ ఆటగాళ్లు 3-1 తేడాతో విజయభేరి మోగించారు. వారి సొంత గడ్డపైనే  వరుస మ్యాచ్ ల్లో ఆసీస్ ను మట్టికరిపించిన భారత్  సిరీస్ ను 3-1 తేడాతో చేజిక్కించుకుంది.

 

ఆదివారం నాటి మ్యాచ్ లో అద్భుతం చేసిన హాకీ ఇండియా అదే ఆట తీరును కనబరిచి ఆస్ట్రేలియా ఆశలకు చెక్ పెట్టింది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలని భావించిన ఆస్ట్రేలియాకు  చుక్కెదురైంది.  ఏ దశలోనూ అవకాశం ఇవ్వని హాకీ ఇండియా ఆటగాళ్లు తన సత్తాను మరోసారి రుచి చూపించి టైటిల్ ను ఎగురేసుకుపోయారు. ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన అనంతరం మంచి ఊపుమీద ఉన్న భారత జట్టు తన విజయ యాత్రను కొనసాగిస్తోంది.

మరిన్ని వార్తలు