బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌కు సన్మానం

27 Sep, 2016 14:16 IST|Sakshi

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌ను ఆంధ్రక్రికెట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత రమేశ్‌ను కూడా ఘనంగా సన్మానించారు. రమేశ్‌కు రూ.2 లక్షల చెక్కును ఎంపీ గోకరాజు గంగరాజు అందజేశారు. తెలుగు వ్యక్తి తొలిసారి బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ కావడం గర్వకారణమని పలువురు వ్యక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోకరాజు గంగరాజుతో పాటు పలువురు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు