హైదరాబాద్‌లో బిలియర్డ్స, స్నూకర్ అకాడమీ

29 Sep, 2013 00:17 IST|Sakshi

రాయదుర్గం, న్యూస్‌లైన్: అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బిలియర్డ్స్, స్నూకర్ అకాడమీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు నేషనల్ షిప్పింగ్ బోర్డ్ చైర్మన్, ఇంటర్నేషనల్ బిలియర్డ్స్ స్నూకర్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు కెప్టెన్ పి.వి.కె.మోహన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ బిలియర్డ్స్, స్నూకర్స్ అసోసియేషన్ (ఏపీబీఎస్‌ఏ), హైదరాబాద్ కార్పొరేట్ ఒలింపిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో  శనివారం కార్పొరేట్ స్నూకర్స్ పోటీలను ఆయన ప్రారంభించారు.
 
 14 నుంచి వరల్డ్ స్నూకర్ పోటీలు
 అక్టోబర్ 14 నుంచి 18 వరకు ఢిల్లీలోని మెరిడియన్స్ హోటల్‌లో వరల్డ్ స్నూకర్ పోటీలను నిర్వహించనున్నట్టు కెప్టెన్ పి.వి.కె మోహన్ తెలిపారు. భారత్ నుంచి పంకజ్ అద్వానీ, ఆదిత్య మెహతాతోపాటు వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో మరో ఆరుగురు క్రీడాకారులు ఇందులో పాల్గొంటారు.
 

మరిన్ని వార్తలు