హైదరాబాద్‌ 329 ఆలౌట్‌

12 Sep, 2017 10:35 IST|Sakshi
హైదరాబాద్‌ 329 ఆలౌట్‌

 ఉత్తరప్రదేశ్‌తో సెమీస్‌ మ్యాచ్‌  
బుచ్చిబాబు క్రికెట్‌ టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత బుచ్చిబాబు ఇన్విటేషనల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ జట్టు భారీస్కోరు సాధించింది. ఉత్తర ప్రదేశ్‌తో సోమవారం చెన్నైలో మొదలైన ఈ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా రాణించడంతో 81.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. కొల్లా సుమంత్‌ (94బంతుల్లో 83; 11 ఫోర్లు), బి. సందీప్‌ (148 బంతుల్లో 84; 5 ఫోర్లు) తన్మయ్‌ అగర్వాల్‌ (97 బంతుల్లో 65; 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. తన్మయ్, సుమంత్‌ రెండో వికెట్‌కు 145 పరుగుల్ని జోడించారు. వీరితో పాటు కె. రోహిత్‌ రాయుడు (31), ఎ. ఆశిష్‌ రెడ్డి (38) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో జీషాన్‌ అన్సారి 5 వికెట్లు దక్కించుకోగా.. ఇంతియాజ్‌ అహ్మద్, సౌరభ్‌ కుమార్‌ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఉత్తరప్రదేశ్‌ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 13 పరుగులు చేసింది.  

 

>
మరిన్ని వార్తలు