పట్టు బిగించిన హైదరాబాద్

24 Nov, 2016 00:04 IST|Sakshi
 వల్సాడ్: ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ తమ రెండో ఇన్నింగ్‌‌సలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లకు 115 పరుగులు చేసింది. అయితే తొలి ఇన్నింగ్‌‌సలో 163 పరుగుల భారీ ఆధిక్యం దక్కడంతో ప్రస్తుతం ఓవరాల్ ఆధిక్యం 278 పరుగులకు చేరింది. అంతకు ముందు ఛత్తీస్‌గఢ్ తొలి ఇన్నింగ్‌‌సలో 188 పరుగులకే ఆలౌటైంది. 
 
 ఆంధ్రకు స్వల్ప ఆధిక్యం
 గువహటి: ఆంధ్రతో జరుగుతున్న మ్యాచ్‌లో కేరళ తమ రెండో ఇన్నింగ్‌‌సలో 5 వికెట్లకు 229 పరుగులు చేసింది. రోహన్ ప్రేమ్ (89) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్‌‌సలో ఆంధ్రకు 7 పరుగుల స్వల్ప ఆధిక్యం కోల్పోయిన కేరళ ప్రస్తుతం 222 పరుగులు ముందంజలో ఉంది. ఆంధ్ర తమ తొలి ఇన్నింగ్‌‌సలో 226 పరుగులు చేసింది. 
>
మరిన్ని వార్తలు