నేటి నుంచి కౌంటర్లలో...

21 Feb, 2019 01:35 IST|Sakshi

హైదరాబాద్‌ వన్డే టికెట్ల అమ్మకాలు

సాక్షి, హైదరాబాద్‌: మార్చి 2న భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఉప్పల్‌ స్టేడియంలో జరిగే తొలి వన్డే కోసం నేటి నుంచి హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) నేరుగా కౌంటర్లలో టికెట్లు అమ్మనుంది. సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మ్యాచ్‌ టికెట్లు కొనుగోలు చేయవచ్చు.  మరోవైపు ఈనెల 11 నుంచే ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉండగా... ఇప్పటికే కొన్నవారు 23 నుంచి జింఖానా మైదానంలోనే వాటిని ‘రిడీమ్‌’ చేసుకొని అసలు టికెట్లను పొందవచ్చని హెచ్‌సీఏ పేర్కొంది.    

మరిన్ని వార్తలు