సాక్షి, హైదరాబాద్: ఐసీఎస్ఈ, ఐఎస్సీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఫుట్బాల్ చాంపియన్గా నిలిచింది. గురువారం గచ్చిబౌలిలోని ఎస్ఏఎస్ఆర్ బాయ్స్ స్కూల్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో హెచ్పీఎస్ (బేగంపేట) జట్టు 3-1 గోల్స్ తేడాతో ఎన్ఏఎస్ఆర్ స్కూల్ బాయ్స్ జట్టుపై విజయం సాధించింది.
అంతకు ముందు జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్ల్లో హెచ్పీఎస్ జట్టు 1-0తో సుజాత స్కూల్పై గెలుపొందింది. మరో మ్యాచ్లో ఎస్ఏఎస్ఆర్ స్కూల్ బాయ్స్ జట్టు 2-1తో అభ్యాస స్కూల్ ను ఓడించింది.