-
హైదరాబాద్: హైదరాబాద్కు పొట్టి క్రికెట్ పండుగ వస్తోంది. ఎన్నికల కారణంగా దుబాయ్, ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఐపీఎల్ ఏడో అంచె పోటీలు ఇక నగరంలో జరగనున్నాయి. హైదరాబాద్ టీమ్ సన్ రైజర్స్ ఆడే నాలుగు మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్నారు.
ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 12, 14, 18, 20న ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతాయి. మ్యాచ్లకు భద్రత ఏర్పాట్లను సైబరాబాద్ పోలిస్ కమిషనర్ సీవీ ఆనంద్ సమీక్షించారు. 1500 మంది పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఒక్కో మ్యాచ్ను 39 వేల మంది వరకు స్టేడియంలో చూసే అవకాశముందని, అభిమానుల కోసం పార్కింగ్ పార్కింగ్ ఏర్పాటుచేశామని సీవీ ఆనంద్ తెలిపారు. స్టేడియం మొత్తం 58 సీసీ కెమెరాలు, స్టేడియం బయట ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు సహా ఎలక్ట్రానిక్ వస్తువుల్ని స్టేడియం లోపలికి అనుమతించబోమని సీవీ ఆనంద్ చెప్పారు.