ముంబై:ఇటీవల జరిగిన ట్వంటీ 20 వరల్డ్ కప్లో వెస్టిండీస్తో సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా తాను ఒక నోబాల్ వేసినా విలన్ ను మాత్రం కాలేదని భారత స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. ఆ మ్యాచ్లోఒక నో బాల్ వేసినా దాన్ని భూతద్దంలో చూపకుండా తనను విలన్ చేయలేదని అశ్విన్ తాజాగా తెలిపాడు. విండీస్ తో మ్యాచ్ ముగిసిన తరువాత మూడు రోజుల పాటు తాను న్యూస్ పేపర్ను చూడలేదన్నాడు. దీంతో తన గురించి ప్రజలు ఏమనుకున్నారు అనేది తెలుసుకునే అవకాశం లేకుండా దూరంగా ఉండిపోయానన్నాడు. ఆ బంతిపై ఎటువంటి చర్చ లేకపోవడంతో తాను 'మ్యాచ్ విలన్' కాలేదన్నాడు. ఒకవేళ దీనిపై ప్రశ్నిస్తే మాత్రం కచ్చితంగా తన వద్ద జవాబు అయితే లేదని అశ్విన్ పేర్కొన్నాడు.
ఆ మ్యాచ్లో లెండిల్ సిమ్మన్స్ ఇచ్చిన రెండు క్యాచ్లు నో బాల్ కావడంతో అతను బతికిపోయిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి అశ్విన్ వేయగా, మరొకటి హార్దిక్ పాండ్యా వేశాడు. దీంతో అతనికి వచ్చిన లైఫ్లను సద్వినియోగం చేసుకున్న సిమ్మన్స్ విండీస్ ను ఫైనల్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.