హైదరాబాద్:బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ లో భాగంగా భారత్ రెండో ఇన్నింగ్స్ లో చటేశ్వరా పూజారా (54 నాటౌట్;58 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడాడు. సాధారణంగా కూల్గా ఆడే పూజారా తన సహజసిద్ధమైన ఆట తీరుకు భిన్నంగా చెలరేగి ఆడాడు. అయితే తన దూకుడుకు బలమైన కారణాలే ఉన్నాయని అంటున్నాడు పూజారా.
'నేను ఒక టెస్టు ఆటగాడిని అనే ముద్ర ఉంది. ఆ ముద్ర సాధ్యమైనంత తొందరగా చెరిగిపోవాలి. నేను అన్ని ఫ్మార్మాట్లకు సరిపోతాననే విషయం నాకు తెలుసు. ఆ క్రమంలోనే దూకుడైన ఆటను ఆడుతున్నా. దీనిలో భాగంగా నా గేమ్లో కొన్ని షాట్లు కూడా వచ్చి చేరాయి. పరిమిత ఓవర్ల క్రికెట్ కు ఉపయోగపడేవిధంగా నా గేమ్ను మార్చుకుంటున్నాను. ఈ ఇన్నింగ్స్ తో పాటు, ఇటీవల దేశవాళీ ట్వంటీ 20ల్లో చేసిన సెంచరీ కూడా నా బ్యాటింగ్ లో మార్పుకు సంకేతం' అని చటేశ్వర పూజారా తెలిపాడు.