నన్ను పిచ్చోడన్నారు!

8 May, 2015 17:31 IST|Sakshi
నన్ను పిచ్చోడన్నారు!

న్యూఢిల్లీ: గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాలపై కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ పెదవి విప్పాడు. ఒలింపిక్స్ రజత పతక విజేత అయిన తనను.. అంతకుముందు ప్రజలు పిచ్చోడు అంటూ వ్యాఖ్యానించిన సందర్భాలను తాజాగా నెమరవేసుకున్నాడు.'నా మొదటి కల ఒలింపిక్స్.'నేను ఆ మెగా ఈవెంట్ లో పాల్గొంటానంటే ప్రజలు పిచ్చోడన్నారు.  అటు తరువాత ఒలింపిక్స్ లో రజత పతకం సాధించి చూపించా' అని రాథోడ్ తెలిపాడు.

 

గురువారం రాత్రి టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అవార్డుల కార్యక్రమంలో భాగంగా ఇక్కడకు హాజరైన రాథోడ్.. ఆ మరిచపోలేని అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. తాను ఒలింపిక్స్ లో పతకం సాధించి దేశం యొక్క పేరును నిలబెట్టడమే కాకుండా అనంతరం కేంద్ర మంత్రిని కూడా అయిన విషయాన్ని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.2004 లో ఏథేన్స్ లో జరిగిన ఒలింపిక్స్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ రజత పతకం సాధించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు