మరో సీజన్ రాజస్థాన్ రాయల్స్‌తోనే...

6 Nov, 2014 01:19 IST|Sakshi
మరో సీజన్ రాజస్థాన్ రాయల్స్‌తోనే...

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు రాహుల్ ద్రవిడ్ వచ్చే సీజన్‌లోనూ మెంటార్‌గా వ్యవహరిస్తాడని ఆ జట్టు ప్రకటించింది. 2013 వరకు ఈ జట్టు తరఫున ఆడిన రాహుల్... గత సీజన్‌లో మెంటార్‌గా వ్యవహరించాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 8 నుంచి మే 25 వరకు ఎనిమిదో సీజన్ ఐపీఎల్ జరుగుతుంది. ప్రస్తుతం తమ దగ్గర 24 మంది క్రికెటర్లు ఉన్నారని, ట్రేడింగ్‌లో ఎవరినీ తీసుకునే ఆలోచన లేదని రాజస్థాన్ జట్టు తెలిపింది.

>
మరిన్ని వార్తలు