'ఆ గేమ్ చూస్తే నాకు బీపీ పెరుగుతుంది'

21 Aug, 2016 16:33 IST|Sakshi
'ఆ గేమ్ చూస్తే నాకు బీపీ పెరుగుతుంది'
రియో ఒలింపిక్స్ చివరి అంకానికి చేరుకున్నాయి. చివరి రోజు పోటీల్లో భాగంగా రెజ్లర్ యోగేశ్వర్ దత్ తలపడనున్నాడు. ఈ నేపథ్యంలో లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన యోగేశ్వర్పై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఈ హర్యానా రెజ్లర్ భారత పతకాల సంఖ్యను మూడుకు పెంచుతాడని క్రిడా పండితులు సైతం అంచనా వేస్తున్నారు.
 
యోగేశ్వర్ పతకం గెలవాలని కాంక్షిస్తూ అతని మిత్రులు, అభిమానులు సోనిపట్‌లో ఆదివారం యాగం నిర్వహించారు. హరిద్వార్లో స్థానికులు యోగేశ్వర్ గెలవాలని కోరుతూ గంగా నదిలో పూజలు చేశారు. అయితే.. యోగేశ్వర్ తల్లి మాత్రం తన కుమారుడు తలపడే బౌట్ను చూడనని చెబుతున్నారు. గతంలో యోగేశ్వర్ తలపడిన బౌట్ను చూసిన ఆమెకు బీపీ పెరిగిందట. అందుకే, యోగేశ్వర్ బౌట్ను చూడనని, అయితే తన కొడుకు ఈ ఒలింపిక్స్‌లో తన కాంస్యాన్ని స్వర్ణంగా మారుస్తాడని నమ్మకంగా చెబుతున్నారు. యోగేశ్వర్ బౌట్ ఆదివారం సాయంత్రం జరుగుతుంది.
 
మరిన్ని వార్తలు