న్యూఢిల్లీ: ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో ఆటగాళ్ల వేలం మళ్లీ వాయిదా పడింది. బిడ్డింగ్లో పాల్గొనేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిం చుకునేందుకు రెండు రోజుల సమయం కావాలని ఫ్రాంచైజీల యజమానులు చేసిన విజ్ఞప్తి మేరకు నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈనెల 22న ఈ వేలం జరిగే అవకాశాలున్నాయి. షెడ్యూల్ ప్రకారం జూన్ 30న జరగాల్సిన వేలాన్ని ఈనెల 19కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. న్యూఢిల్లీలో ఈనెల 21న ఫ్రాంచైజీలన్నీ సమావేశమవుతాయని లీగ్ కమర్షియల్ పార్ట్నర్ స్పోర్టీ సొల్యూషన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆగస్టు 14 నుంచి 31 వరకు ఐబీఎల్ జరగనుంది. వేలంలో పాల్గొనే విదేశీ ఆటగాళ్ల తుది జాబితా ఇప్పటివరకూ ఖరారు కాకపోవడమే వేలం వాయిదా వేయడానికి కారణమనే కథనం వినిపిస్తోంది.