టీమిండియా@ 3

1 May, 2017 22:47 IST|Sakshi
టీమిండియా@ 3

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌ల్లో భారత్‌ మూడోస్థానాన్ని దక్కించుకుంది. ఇటీవల వన్డేల్లో మెరుగైన ప్రదర్శనతో కోహ్లిసేన ఐదు పాయింట్లు తన ఖాతాలో వేసుకుంది.

ప్రస్తుతం 117 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న భారత్‌ కంటే మెరుగ్గా దక్షిణాఫ్రికా (123 పాయింట్లు), ఆస్ట్రేలియా (118 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, వెస్టిండీస్, అఫ్గానిస్తాన్‌ వరుసగా నాలుగు నుంచి పది స్థానాల్లో కొనసాగుతున్నాయి.  

>
మరిన్ని వార్తలు