ఫైనల్‌కు ముందు గాయపడిన క్రికెటర్‌

23 Jul, 2017 10:10 IST|Sakshi
ఫైనల్‌కు ముందు గాయపడిన క్రికెటర్‌

లార్డ్స్: మహిళా ప్రపంచకప్‌ ఫైనల్‌కు ముందు హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ గాయపడ్డారు. శనివారం నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో ఆమె భుజానికి గాయమైంది. దీంతో ఆమె వెంటనే నెట్స్‌ నుంచి నిష్క్రమించారు. సెమీస్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారత్‌ను హన్మన్‌ ప్రీత్‌ ఫైనల్‌కు చేర్చిన విషయం తెలిసిందే.

గాయంతో ప్రీత్‌ ఫైనల్‌ ఆడటంలేదని వార్తలు వచ్చాయి. దీంతో భారత్‌ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే, వీటిని కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ ఖండించారు. నెట్స్‌ నుంచి వెళ్లిన ఆమె భుజానికి ఐస్‌ ప్యాక్‌ పెట్టుకొని ఉపశమనం పొందారని తెలిపారు. కౌర్‌ తుదిపోరుకు ఫిట్‌గా ఉంటారని చెప్పారు. ముందు జాగ్రత్త కోసమే ఆమె ఐస్‌ ప్యాక్‌ పెట్టుకున్నారని తెలిపారు.

మరిన్ని వార్తలు