భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌కు అనుమతి

17 Mar, 2015 11:12 IST|Sakshi
భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌కు అనుమతి

న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన భారత జట్టును సంతోషపరిచే నిర్ణయాన్ని బీసీసీఐ తీసుకుంది. ఈ టోర్నీలో ఏకాగ్రత చెదరకుండా, ఇప్పటివరకు ఆటగాళ్లతో పాటు వారి భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్‌ను అనుమతించలేదు. అయితే ఇప్పుడు ఈ నిబంధనను బోర్డు మార్చింది. నాకౌట్ దశలో వారిని తమ వెంట ఉంచేందుకు అనుమతించింది. అంటే ఇకపై ప్రపంచకప్ సమయంలో భారత క్రికెటర్లతో వారి భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్ కలిసి ఉండే అవకాశం ఉంది. శిఖర్ ధావన్ ఇప్పటికే తన భార్య ఆయేషాతో కలిసి మెల్‌బోర్న్ వీధుల్లో షాపింగ్ చేస్తూ కనిపించడం విశేషం.

>
మరిన్ని వార్తలు