అంకుశ్‌ పసిడి పంచ్‌

26 Jun, 2017 03:36 IST|Sakshi
అంకుశ్‌ పసిడి పంచ్‌

న్యూఢిల్లీ:  ఉలాన్‌బాటర్‌ కప్‌ బాక్సింగ్‌ టోర్నీలో భారత యువ బాక్సర్‌ అంకుశ్‌ దహియా సత్తా చాటాడు. మంగోలియాలో ఆది వారం ముగిసిన ఈ టోర్నీలో అతను పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

60 కేజీల విభాగం ఫైనల్లో 19 ఏళ్ల అంకుశ్‌ కొరియాకు చెందిన చో చోల్‌ను ఓడించాడు. మణిపూర్‌కు చెందిన దేవేంద్రో సింగ్‌ (52 కేజీలు) రజతాన్ని సాధించాడు. ఫైనల్లో దేవేంద్రో 2–3తో సుగురో (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. మొత్తం ఈ టోర్నీలో భారత్‌ స్వర్ణం, రజతం, 3 కాంస్య పతకాలను సాధించింది.

మరిన్ని వార్తలు