సెమీస్‌లో భారత్

13 Mar, 2015 00:47 IST|Sakshi
సెమీస్‌లో భారత్

న్యూఢిల్లీ: మహిళల వరల్డ్ లీగ్ రౌండ్-2లో భారత హాకీ జట్టు సెమీఫైనల్స్‌కు చేరింది. వందన కఠారియా హ్యాట్రిక్ గోల్స్ సహాయంతో గురువారం జరిగిన క్వార్టర్స్‌లో 10-0 తేడాతో సింగపూర్‌ను చిత్తుగా ఓడించింది.

మొత్తంగా వందన నాలుగు గోల్స్ (17, 48, 56, 57వ నిమిషాల్లో), పూనమ్ రాణి (4వ ని), నవ్‌జ్యోత్ కౌర్ (6వ ని), అనూపా బర్లా (19వ ని), దీపికా (32వ ని), రాణీ రాంపాల్ (35వ ని), జస్ప్రీత్ కౌర్ (51వ ని) ఒక్కో గోల్ సాధించారు. శనివారం జరిగే సెమీస్‌లో భారత జట్టు థాయ్‌లాండ్‌ను ఢీకొంటుంది.
 

>
మరిన్ని వార్తలు