నిలిచిపోయిన రెండో రోజు ఆట

11 Jun, 2015 14:02 IST|Sakshi
నిలిచిపోయిన రెండో రోజు ఆట

ఫతుల్లా: వర్షం కారణంగా, భారత్-బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్, రెండో రోజు ఆట నిలిచిపోయింది. ఉదయం ప్రారంభం కావాల్సిన మ్యాచ్ వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో రెండో రోజు ఆటను నిలిపివేశారు. దీంతో ఒక్క బంతి కూడా బౌల్ చేయకుండానే రెండోరోజు ఆట ముగిసింది. ఈ టెస్ట్ లో భాగంగా మూడవ రోజు ఆట తిరిగి రేపు ఉదయం 9:30 కు ప్రారంభం కానుంది. తొలిరోజు మ్యచ్  ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా239 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (158 బంతుల్లో 150 బ్యాటింగ్; 21 ఫోర్లు), మురళీ విజయ్ (178 బంతుల్లో 89; 8 ఫోర్లు, 1 సిక్స్) నాటౌట్గా నిలిచిన విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు