అక్టోబర్ లో భారత పర్యటనకు ఆస్ట్రేలియా

3 Jul, 2013 18:27 IST|Sakshi
అక్టోబర్ లో భారత పర్యటనకు ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుఈ ఏడాది అక్టోబర్ లో భారత పర్యటనకు రానుంది. అక్టోబర్-నవంబర్ లో  ఆస్ట్రేలియా, టీమిండియా జట్ల మధ్య వన్డే సిరిస్ జరగనుంది. సిరీస్ లో భాగంగా ఈ రెండు జట్ల మధ్య ఏడు వన్డే మ్యాచ్ లు, ఒక టి20 మ్యాచ్ జరుగుతాయని భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) తెలిపింది.
 

రాజ్ కోట్ లో అక్టోబర్ 10న జరగనున్న టి20తో సిరీస్ ప్రారంభమవుతుంది. పుణేలో అక్టోబర్ 13న తొలి వన్డే జరుగుతుంది. జైపూర్, మొహాలి, రాంచి, కటక్, నాగపూర్, బెంగళూరులో మిగతా మ్యాచ్ లు ఆడనున్నాయి. చివరి మ్యాచ్ నవంబర్ 2న జరుగుతుంది.

ఆస్ట్రేలియా ఈ ఏడాది మార్చిలో భారత్ లో పర్యటించింది. టీమిండియాతో నాలుగు టెస్టుల సిరీస్ ఆడింది. ఆసీస్ 4-0తో సిరీస్ ఓడిపోయింది. భారతగడ్డపై ఆస్ట్రేలియా చివరిసారిగా 2009, అక్టోబర్-నవంబర్ లో ఏడు వన్డేల సిరీస్ ఆడింది. 4-2 తేడాతో ఆసీస్ సిరీస్ గెల్చుకుంది. ముంబై జరగాల్సిన చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.  

మరిన్ని వార్తలు