బులవాయో: జింబాంబ్వేతో ఇక్కడ జరిగిన నాల్గో వన్డేలో భారత్ 9 వికెట్లు తేడాతో విజయం సాధించింది. 145 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ కేవలం ఒక వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ పూజారా(13) పరుగులకే పెవిలియన్ చేరినప్పటికీ, రోహిత్ శర్మ(64), సురేష్ రైనా(66) పరుగులతో రాణించడంతో భారత్కు సునాయాసంగా విజయం దక్కింది. కేవలం ఒక వికెట్టు మాత్రమే కోల్పోయిన భారత్ 30.5 ఓవర్లలో విజయం సాధించింది. జింబాంబ్వే బౌలర్లలో చతారాకు మాత్రమే వికెట్టు దక్కింది.
అంత కు ముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ జింబాంబ్వేను తక్కువ పరుగులకే కట్టడి చేసింది. జింబాంబ్వే నిలకడలేమితో తక్కువ స్కోరుకే పరిమితమైంది. చిగుంబరా(50), వాలర్ (35) పరుగులు మాత్రమే చేయడంతో జింబాంబ్వే మరోమారు చతికిలబడింది. భారత్ బౌలర్లలో అమిత్ మిశ్రాకు మూడు వికెట్లు లభించగా, శర్మ, జడేజాలకు తలో రెండు వికెట్లు దక్కాయి. ఈ తాజా విజయంతో భారత్ ఖాతాలో నాల్గో విజయం చేరింది.