వరల్డ్‌ కప్‌ స్నూకర్‌ ఫైనల్లో భారత్‌

2 Jul, 2019 04:31 IST|Sakshi
పంకజ్‌ అద్వానీ, లక్ష్మణ్‌ రావత్‌

అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్‌ సమాఖ్య (ఐబీఎస్‌ఎఫ్‌) వరల్డ్‌ కప్‌ స్నూకర్‌ టోర్నమెంట్‌లో పంకజ్‌ అద్వానీ, లక్ష్మణ్‌ రావత్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. దోహాలో సోమవారం జరిగిన సెమీఫైనల్లో భారత్‌ 3–2 (57–59, 7–76, 101–9, 66–16, 75–34) ఫ్రేమ్‌ల తేడాతో బ్రెండన్‌ ఒడొనోగుయె, ఆరన్‌ హిల్‌లతో కూడిన ఐర్లాండ్‌ జట్టుపై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో పాకిస్తాన్‌ (అస్జద్‌ ఇక్బాల్, మొహమ్మద్‌ బిలాల్‌)తో భారత్‌ తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్‌ 3–1తో ఖతర్‌పై గెలిచింది.

మరిన్ని వార్తలు