భారత్‌ శుభారంభం

23 Sep, 2018 21:57 IST|Sakshi


దుబాయ్‌ : ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 238 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన భారత్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ ఆచితూచి ఆడుతూ పాక్‌ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటున్నారు.

శిఖర్‌ ధావన్‌ ధాటిగా ఆడుతుండగా, రోహిత్‌ క్రీజ్‌లో కుదురుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఓపెనింగ్‌ జోడీ మరికొద్ది ఓవర్లు పాక్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటే భారత్‌ ఆసియా కప్‌లో పాక్‌పై మరోసారి విజయం సాధించే అవకాశం ఉంది.  
 

మరిన్ని వార్తలు