‘పసిడి’పై భారత ఆర్చరీ జట్ల గురి

27 Aug, 2018 06:09 IST|Sakshi
జ్యోతి సురేఖ

కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో ఫైనల్లోకి

ఆర్చరీ కాంపౌండ్‌ విభాగంలో భారత జట్లు  స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించి పతకాలను ఖాయం చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ జ్యోతి సురేఖ, ముస్కాన్, మధుమితలతో కూడిన భారత మహిళల జట్టు సెమీఫైనల్లో 225–222తో చైనీస్‌ తైపీపై గెలిచింది.  పురుషుల విభాగంలో అభిషేక్‌ వర్మ, అమన్‌ సైనీ, రజత్‌ చౌహాన్‌లతో కూడిన భారత జట్టు సెమీఫైనల్లో 230–227తో చైనీస్‌ తైపీ బృందంపై నెగ్గింది. మంగళవారం పసిడి పతకాల కోసం జరిగే ఫైనల్స్‌లో దక్షిణ కొరియా జట్లతో భారత పురుషుల, మహిళల జట్లు తలపడతాయి.

మరిన్ని వార్తలు