భారత్ పరాజయం

28 Jun, 2015 00:59 IST|Sakshi

యాంట్‌వర్ప్ (బెల్జియం) : హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నమెంట్ లీగ్ దశను భారత మహిళల జట్టు ఓటమితో ముగించింది. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్‌కు అర్హత పొందిన భారత జట్టు... ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో 2-4 తో ఓడింది. భారత్ తరఫున వందన, పూనమ్ రాణి ఒక్కో గోల్ సాధించగా... ఆస్ట్రేలియా జట్టుకు కెన్నీ జోడీ నాలుగు గోల్స్ అందించడం విశేషం.

మరిన్ని వార్తలు