భారత్‌ వర్సెస్‌ ఒమన్‌

5 Sep, 2019 10:00 IST|Sakshi

గువాహటి: ఖతర్‌ ఆతిథ్యమివ్వనున్న ఫిఫా వరల్డ్‌కప్‌ –2022 అర్హత పోటీల్లో భాగంగా నేడు భారత్‌ ఒమన్‌తో తలపడనుంది. తమ కంటే ర్యాంకింగ్‌లో మెరుగైన ఒమన్‌తో పోరుకు సిద్ధంగా ఉన్నామని భారత ఫుట్‌బాల్‌ కోచ్‌ ఇగోర్‌ స్టిమాక్‌ తెలిపారు. ‘వాస్తవంగా చెప్పాలంటే భారత్‌ ఉన్న గ్రూప్‌లో ఖతర్, ఒమన్‌లు పటిష్టమైన జట్లు. ప్రపంచ కప్‌ అర్హత పోటీల్లో వాటిని ఇంతవరకూ మేము ఓడించలేదు. కానీ మేము గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతాం.’ అని ఆయన అన్నారు. మూడో రౌండ్‌ అర్హత పోటీలకు క్వాలిఫై కావాలంటే భారత్‌ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలవాలి. భారత్‌ ఒమన్‌లతో పాటు గ్రూప్‌లో ఖతర్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లున్నాయి.  

మరిన్ని వార్తలు