భారత్, న్యూజిలాండ్‌ ప్రొ హాకీ లీగ్‌ మ్యాచ్‌లు రద్దు

11 Apr, 2020 05:18 IST|Sakshi

న్యూఢిల్లీ: వచ్చే నెలలో 23, 24వ తేదీల్లో భువనేశ్వర్‌లో భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరగాల్సిన రెండు ప్రొ హాకీ లీగ్‌ మ్యాచ్‌లు రద్దయ్యాయి. న్యూజిలాండ్‌ ప్రభుత్వం లాక్‌డౌన్‌ మార్గనిర్దేశకాలను అనుసరించి ప్రస్తుత పరిస్థితుల్లో తాము విదేశాల్లో పర్యటించే అవకాశం లేదని... అందుకే భారత్‌తో జరిగే రెండు ప్రొ హాకీ లీగ్‌ మ్యాచ్‌లను, చైనాలో మహిళల హాకీ జట్టు పర్యటనను రద్దు చేసుకుంటున్నామని న్యూజిలాండ్‌ హాకీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇయాన్‌ ఫ్రాన్సిస్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు