ఆసీస్ చేతిలో భారత్ ఓటమి

12 Dec, 2016 15:03 IST|Sakshi
నాలుగు దేశాల హాకీ
 మెల్‌బోర్న్: నాలుగు దేశాల ఇన్విటేషనల్ హాకీ టోర్నమెంట్‌లో భారత్ 2-3 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం చవిచూసింది. భారత్ తరఫున రూపిందర్ పాల్ సింగ్ (21వ ని., 53 వ ని.) రెండు గోల్స్ సాధించగా... ఆసీస్‌కు హేవర్డ్ (24వ ని., 36 వ ని.) రెండు గోల్స్ అందించాడు. ట్రెంట్ మిటన్ (43 వ ని.) ఆసీస్‌కు మూడో గోల్ అందించాడు.
 
 మహిళల విజయం
 ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో భారత మహిళల జట్టు బోణీ చేసింది. తొలి మ్యాచ్‌లో రాణీ రాంపాల్ గోల్‌తో భారత్ 1-0తో ఆసీస్‌ను ఓడించింది. ఆస్ట్రేలియా మహిళల జట్టుపై భారత్ గెలవడం ఇదే తొలిసారి కావడం విశేషం.  
 
మరిన్ని వార్తలు