చైనా ముందు చేతులెత్తేశారు

23 May, 2018 01:38 IST|Sakshi
ప్రణయ్‌

చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఓడిన భారత్‌

బ్యాంకాక్‌: థామస్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ ప్రపంచ టీమ్‌ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు మూకుమ్మడిగా చేతులెత్తేసింది.  గ్రూప్‌ ‘ఎ’లో మంగళవారం చైనాతో జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 0–5తో వైట్‌వాష్‌ అయ్యింది. తొలి పోరులో ప్రణయ్‌ 9–21, 9–21తో చెన్‌లాంగ్‌ చేతిలో చిత్తుగా ఓడాడు. రెండో మ్యాచ్‌లో అర్జున్‌–శ్లోక్‌ జంట 12–21, 15–21తో లీ చంగ్‌–జంగ్‌ నాన్‌ జోడీ చేతిలో కంగుతింది. మూడో మ్యాచ్‌లో  సాయిప్రణీత్‌ పోరాడి ఓడాడు.

షి యుకితో జరిగిన పోరులో అతను 9–21, 21–15, 12–21తో పరాజయం చవిచూశాడు. నాలుగో మ్యాచ్‌లో లీ జున్‌హుయ్‌–లీ యుచెన్‌ ద్వయం 21–15, 20–22, 21–15తో అరుణ్‌–సాన్యమ్‌ శుక్లా జంటపై గెలిచింది. చివరి సింగిల్స్‌లో లిన్‌ డాన్‌ 16–21, 21–9, 21–8తో లక్ష్యసేన్‌ను ఓడించాడు.  

మరిన్ని వార్తలు