రియోలో భారత హాకీ జట్టు శుభారంభం

6 Aug, 2016 22:13 IST|Sakshi
రియోలో భారత హాకీ జట్టు శుభారంభం

రియో ఒలింపిక్స్ లో భారత హాకీ పురుషుల జట్టు శుభారంభం చేసింది. రియోలో శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్ లో 3-2 గోల్స్ తేడాతో ఐర్లాండ్ పురుషుల జట్టుపై భారత్ విజయం సాధించింది. భారత్ తరఫున రుపేందర్ పాల్ సింగ్ రెండు గోల్స్ చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించగా, మరో ఆటగాడు రఘునాత్ ఒక గోల్ చేశాడు. దీంతో ఐర్లాండ్ తమ తొలి మ్యాచ్ లోనే ఓటమి పాలైంది.

మరిన్ని వార్తలు