కష్టాల్లో టీమిండియా

17 Dec, 2018 14:15 IST|Sakshi

పెర్త్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. ఆసీస్‌ నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యంతో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన టీమిండియా 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. కేఎల్‌ రాహుల్‌ డకౌట్‌గా నిష్క్రమించగా, చతేశ్వరా పుజారా(4), విరాట్‌ కోహ్లి(17), మురళీ విజయ్‌(20)లు సైతం పెవిలియన్‌ బాట పట్టారు.మిచెల్‌ స్టార్క్‌ వేసిన తొలి ఓవర్‌ నాల్గో బంతికి రాహుల్‌ పెవిలియన్‌ చేరగా,  హజల్‌వుడ్‌ బౌలింగ్‌లో పుజారా కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

ఆ తరుణంలో మురళీ విజయ్‌-కోహ్లిల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేసింది. కాగా, వీరిద్దరూ 35 పరుగులు జత చేసిన తర్వాత కోహ్లి మూడో వికెట్‌గా ఔటయ్యాడు. నాథన్‌ లయన్‌ బౌలింగ్‌ స్లిప్‌ క్యాచ్‌ కోహ్లి పెవిలియన్‌ చేరాడు. ఆపై మరొకసారి టీమిండియాకు లయన్‌ షాకిచ్చాడు. విజయ్‌ను బౌల్డ్‌ చేసి భారత్‌ను మరింత కష్టాల్లోకి నెట్టాడు. అంతకుముందు ఆసీస్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. 132/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్‌.. మరో 111 పరుగుల్ని జోడించి మిగతా ఆరు వికెట్లను నష్టపోయింది.  మహ్మద్‌ షమీ ఆరు వికెట్లు సాధించగా, బూమ్రా మూడు, ఇషాంత్‌ శర్మ వికెట్‌ తీశాడు.

మరిన్ని వార్తలు