కేప్టౌన్: భారత్, దక్షిణాఫ్రికా మహిళల హాకీ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో మూ డో నిమిషంలోనే ఆతిథ్య జట్టు నుంచి మారిజెన్ మరైస్ ఫీల్డ్ గోల్ చేసి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అం దించింది. అయితే 24వ నిమిషంలో భారత్కు స్కో రును సమం చేసే అవకాశం చిక్కింది. గుర్జిత్ కౌర్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచింది. రెండు నిమిషాల అనంతరం దీప్ గ్రేస్ కౌర్ మరో పెనాల్టీని గోల్గా మలిచి సఫారీలపై ఒత్తిడిని పెంచింది. తొలి అర్ధభాగం ముగిసే సరికి భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. అయితే మూడో క్వార్టర్లో దక్షిణాఫ్రికా పుం జుకుంది. 34వ నిమిషంలో డిరికీ చాంబర్లెన్ గోల్ చేయడంతో స్కోరు 2-2తో సమమైంది. ఆ తర్వాత ఇరు జట్లకు గోల్స్ చేసేందుకు పలు అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాయి.