భారత్ 130/4

7 Feb, 2014 11:03 IST|Sakshi

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలిటెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో 39 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. శిఖరదావన్, మురళీ విజయ్, పుజారా, కోహ్లీ అవుటయ్యారు. 67 పరుగలలో రోహిత్ శర్మ , 23 పరుగులతో రహానా  క్రీజులోనే ఉన్నారు. ఇష్ సోది, కేన్ విలియమ్సన్ బౌలింగ్ చేస్తున్నారు.

 

భారత్, న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య గురువారం తెల్లవారుజామున అక్లాండ్ లో ప్రారంభమైంది. మొదటగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 503 పరుగులు తీసింది.

మరిన్ని వార్తలు