మూడో ర్యాంకులో భారత్

24 Sep, 2016 10:29 IST|Sakshi
మూడో ర్యాంకులో భారత్

 దుబాయ్: ఇటీవలి కాలంలో వన్డే మ్యాచ్‌లు ఆడనప్పటికీ ఐసీసీ వన్డే జట్ల ర్యాంకింగ్స్ లో టీమిండియా (110 పాయింట్లు) మూడో  స్థానంలో నిలిచింది. శుక్రవారం ప్రకటించిన ఈ జాబితాలో ఆస్ట్రేలియా (124) టాప్‌లో ఉండగా న్యూజిలాండ్ (113) రెండో స్థానంలో ఉంది. అయితే ఈనెల 30 నుంచి ఆసీస్‌తో జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో 3-2తో దక్షిణాఫ్రికా నెగ్గితే భారత్ నాలుగో స్థానానికి పడిపోతుంది. వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్‌‌సలో కోహ్లి (813)  రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు.  
 

>
మరిన్ని వార్తలు