మౌంట్ మాంగనీ: టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ ఆదిలోనే రెండు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ మార్టిన్ గప్టిల్(15)ను తొలి వికెట్గా నష్టపోయిన కివీస్.. ఆపై కెప్టెన్ కేన్ విలియమ్సన్(20) వికెట్ను చేజార్చుకుంది. దాంతో కివీస్ 51 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో్ పడింది. గప్టిల్ను భువనేశ్వర్ కుమార్ పెవిలియన్ పంపగా, విలియమ్సన్ను షమీ ఔట్ చేశాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా 325 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్ శర్మ(87; 96 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు), శిఖర్ ధావన్(66; 67 బంతుల్లో 9 ఫోర్లు)ల హాఫ్ సెంచరీలకు తోడు విరాట్ కోహ్లి(43; 45 బంతుల్లో 5 ఫోర్లు) , అంబటి రాయుడు(47; 49 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్), ఎంఎస్ ధోని(48 నాటౌట్;33 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్)లు రాణించడంతో భారత్ జట్టు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 324 పరుగుల భారీ స్కోరు చేసింది.