టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా

14 Jan, 2020 13:20 IST|Sakshi

ముంబై : టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వాంఖడే మైదానంలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో  టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. రెండో వన్డే గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ నెల 17న, మూడో వన్డే 19న బెంగుళూరులో జరుగనుంది. ఇరు జట్లు కూడా పూర్తి స్థాయి బలగంతో బరిలోకి దిగుతుండటంతో ఈ వన్డే సిరీస్‌ హోరాహోరీగా సాగనుంది. 2019 మార్చిలో భారత్‌లోనే జరిగిన వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు టీమిండియా నెగ్గగా... చివరి మూడు గెలిచిన ఆసీస్‌ సిరీస్‌ సొంతం చేసుకుంది.
(చదవండి : అసలు సమరానికి సై)

తుది జట్ల వివరాలు
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, ధావన్, రాహుల్, అయ్యర్, పంత్‌ (కీపర్‌), జడేజా, శార్దుల్, కుల్దీప్, బుమ్రా, షమీ.

ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), వార్నర్, స్మిత్, లబ్‌షేన్, క్యారీ, అగర్, జంపా, స్టార్క్, కమిన్స్‌, ఆష్టన్‌ టర్నర్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌

>
మరిన్ని వార్తలు