ఆ ‘మోజు’ పోయింది

27 Mar, 2016 01:08 IST|Sakshi
ఆ ‘మోజు’ పోయింది

కెరీర్ ఆరంభంలో స్టయిల్‌గా ఉండటం, రకరకాల టాటూల మీద మోజు ఉండేదని, ఇప్పుడది పోయిందని భారత స్టార్ విరాట్ కోహ్లి చెప్పాడు. ‘మానసికంగా దృఢంగా ఉండటానికి నేనేం పూజా పునస్కారాలు చేయను. గతంతో పోలిస్తే ఆలోచనా విధానం మారింది. ప్రతిసారీ నెట్స్‌కి వెళ్లినప్పుడు 0.1 శాతమైనా నా ఆటను మెరుగుపరుచుకోవాలనే లక్ష్యంతో వెళుతున్నాను. జట్టు కోసం ఏదైనా చేయాల్సిందే అనే పట్టుదల వల్లే రాటుదేలాను’ అని కోహ్లి చెప్పాడు.

మరిన్ని వార్తలు